మీకు తెలుసా.........గాలిలో వేలాడే స్థంభం ఒకటుందని ,
ఎంతో మంది ఇంజనీర్లు ఈ ఆలయ స్తంభపు మిస్టరీని చేధించలేక
“ మిస్టీరియస్ టెంపుల్ “ అని పిలిచారనే సంగతి . తెలియని వారికోసం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ :
“ లేపాక్షి టెంపుల్ “ అని పిలవబడే ఈ వీరభద్ర ఆలయం
అనంతపురం జిల్లాలో ఉంది.
16 వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన
ఈ ఆలయంలో ఒక స్థంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు.
గాలిలో వేలాడుతున్నట్లుగా ఉండే ఈ స్థంభం కింది నుంచి ఒక సన్నని క్లాత్ ను ఒక వైపు ఇంకో వైపుకు తీయొచ్చు.
ఈ ఆలయానికున్న మరో చరిత్ర ఏమిటంటే..........,
రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలో పడగానే , శ్రీరాముడు ఆ పక్షిని చూసి “ లే పక్షి “ అని పిలిచారట.
అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది.

No comments:
Post a Comment